రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సమావేశంలో వ్యవసాయం, వైద్యం, ఉపాధి హామీలపై సమీక్ష జరిగింది.
వానకాలం పంటల సాగు మొదలైన నేపథ్యంలో ఎరువులు, విత్తనాల అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతు సంక్షేమానికే సర్కారు యేటా రూ.70 వేల కోట్లు వేచ్చిస్తున్నదని అన్నారు. పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల ద్వారా గ్రామాలకే ఎరువులు సరఫరా చేయాలని సూచించారు.