కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎంసెట్తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. లాక్డౌన్ అనంతరం పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రవేశ పరీక్షల తేదీలు: జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్. జులై 24న ఈసెట్, జులై 25న ఐసెట్, ఆగస్టు 2 నుంచి 4 వరకు పీజీసెట్, ఆగస్టు 5న ఎడ్సెట్, ఆగస్టు 6న లాసెట్, ఆగస్టు 7 నుంచి 9 వరకు పీఈసెట్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
బీజేపీ పాలనలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి: సీఎల్పీ భట్టి