సిగరెట్ల వ్యసనాన్ని వదులుకోవాలని భార్య మందలించిందన్న కోపంతో యాసిడ్ తాగి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం చెన్నై సాలిగ్రామం మదియళగన్కు చెందిన నరసింహన్ (72) ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. పిల్లలు వేరే ప్రాంతంలో సెటిల్ కావడంతో దంపతులు ఇద్దరే ఉంటున్నారు.
సిగరెట్ అలవాటున్న నరసింహన్కు ఇటీవల తరచూ దగ్గు వస్తుండడంతో అందుకు సిగరెట్లే కారణమని, మానేయాలని భార్య ఒత్తిడి చేసింది. ఈ విషయమై బుధవారం దంపతుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన నరసింహన్ బాత్రూంకు వెళ్లి యాసిడ్ సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధ్ర్యాప్తు చేస్తున్నారు.
ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యత: చంద్రబాబు