telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీ రేటుకు అమ్ముడుపోయిన ప్రభాస్ మూవీ శాటిలైట్ రైట్స్

Prabhas

హీరోగా ప్రభాస్‌కున్న క్రేజ్‌తో ‘సాహో’ సినిమా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క హిందీలోనే ఏకంగా రూ. 200 కోట్ల వరరకు రాబట్టి హీరోగా ప్రభాస్ క్రేజ్ ఏమిటో చెప్పకనే చెప్పింది. ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమాను అమెజాన్ వారు రూ. 100 కోట్లను పెట్టి మరి కొనుక్కున్నారు. మరోవైపు ఈ సినిమా తెలుగు తప్పించి మిగతా భాషలకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడమే కాదు. ఆయా భాషల్లో ఈ సినిమాను ప్రసారం చేసారు. కానీ తెలుగు శాటిలైట్ రైట్స్‌ను మాత్రం హోల్డ్‌లో పెట్టారు. తాజాగా ‘సాహో’ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ తెలుగు చానల్ రూ.20 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలందరు ఇళ్లలోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రసారమైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు 23 పైగా టీఆర్పీ వచ్చింది. ఈ టీర్పీ రావడంలో కరోనా లాక్‌డౌన్ కూడా కీ రోల్ పోషించిందనే చెప్పాలి. దాదాపు ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడం అదే సమయంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రసారం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎగబడి మరి చూసారు. దీంతో మహేష్ బాబు గత ఏ సినిమాలకు లేనటు వంటి రేటింగ్ ఈ సినిమాకు వచ్చింది. అందుకే సాహో చిత్ర యూనిట్ వెంటనే ‘సాహో’ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను సరైన సమయంలో ఓ తెలుగు ఛానెల్‌కు అమ్ముకున్నారు. దీంతో నెక్ట్స్ వీక్ లోపే ఈ సినిమా సదరు టీవీ ఛానెల్‌లో ప్రసారం అయ్యేలా ఒప్పందం చేసుకున్నారు.

Related posts