కరోనా మహమ్మారి కట్డడిలో భాగంగా కేంద్రం దేశంలో లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఎంతో మంది పేదవాళ్లతో పాటు సినీ కార్మికులు కూడా ఉన్నారు. వీళ్లను ఆదుకోవడంలో భాగంగా చాల మంది తెలుగు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కరోనా పై పోరాటంలో తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లు రూ. 25 లక్షల విరాళాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ అందజేసారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన నిర్మాతలు అభిషేక్ నామా, రామ్ మోహన్, ఏషియన్ సునీల్ నారంగ్, మురళీమోహన్ అందరు కలిసి ఈ విరాళానికి సంబంధించిన రూ. 25 లక్షల చెక్ను మంత్రి కేటీఆర్కు అందజేసారు.
previous post