ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబయినా, నిమ్మగడ్డ రమేశ్కుమార్ అయినా సరే ఎవరూ ఈ వ్యవహారం నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.
‘నిమ్మగడ్డ రాసినట్టు చెబుతున్న లేఖ ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు. అందులో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఆరోపణలు, ఆర్డినెన్స్ ను తప్పు పట్టే వ్యాఖ్యలున్నాయని ఆయన అన్నారు.

