కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి, అమృతహల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నగరంలోని రమడా హోటల్ లో క్యాంప్ వేసిన 21 మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వెళ్లిన దిగ్విజయ్ ని హోటల్ సమీపంలో పోలీసులు అడ్డుకోగా ఆయన రోడ్డుపైనే బైఠాయించారు.
అంతకుముందు బెంగళూరుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ స్వాగతం పలికారు. ఆపై వారిద్దరూ కలిసి హోటల్ వద్దకు వెళ్లగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం దిగ్విజయ్ మాట్లాడుతూ తాను ఎంపీనని, 26న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలతో మాట్లాడాలని తాను వచ్చానని, కానీ పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసిన స్టాలిన్