ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈశాన్య ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. బాబర్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎన్నికల అధికారి ఉధమ్ సింగ్ హఠాన్మరణం చెందారు.
ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న ఉధమ్ సింగ్ పోలింగ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇతర సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయారని డాక్టర్లు చెప్పడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. గుండెపోటు కారణంగానే ఆ అధికారి చనిపోయినట్టు వైద్యులునిర్దారించారు.