దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళా భద్రతాపై ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని, మహిళా భద్రత కోసమే దిశా చట్టాన్ని ప్రవేశ పెట్టామని మంత్రి సుచరిత అన్నారు. ఈనెల 7న దిశా పోలీస్ స్టేషన్ను రాజమండ్రిలో సీఎం జగన్ ప్రారంభించనున్నారని మంత్రి పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దిశ చట్టం కోసం పోలీసులకు శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు.మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి ఏపీలోనే సంవత్సరానికి 12 నుంచి 15 వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు. దిశ చట్టం ద్వారా శిక్ష వెంటనే పడుతుందన్న భయంతో నేరాలు తగ్గుతాయని మంత్రి పేర్కొన్నారు.
తల్చుకుంటే మీ కంటే పదింతలు చెయ్యగలను..పరిధులు దాటవద్దు