తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 858 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 09 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 996 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,237 కు చేరగా.. రికవరీ కేసులు 6,08,883 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,678 గా ఉంది.. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 97.37 శాతంగా ఉందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 12,726 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 1,08, 617 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని బులెటిన్లో పేర్కొంది సర్కార్.
previous post