రాజధాని అమరావతిని తరలించవద్దనే డిమాండ్ తో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారీ ఎత్తున బలగాలను మోహరింపజేసింది. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ముఖ్యమంత్రి జగన్ యత్నిస్తున్నారని అన్నారు. ఉద్యమాన్ని ఎంత అణచివేస్తే అంత ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పారు.
జగన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొట్టే చర్యలను వైసీపీ ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. రాజధాని గ్రామాలు బోర్డర్ ను తలపిస్తున్నాయని నారా లోకేశ్ అన్నారు. పాకిస్థాన్ బోర్డర్ లో కూడా ఇంత మంది పోలీసులు ఉండరని మండిపడ్డారు.
స్వచ్ఛమైన రాజకీయాలు చేశాం: పవన్ కల్యాణ్