మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మెగా సూపర్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో మిల్కీ బ్యూటీ తమన్నా నోరు జారారు. ఓవర్ ఎగ్జైట్మెంట్లో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ని ‘ఏరా’ అనేశారు. అయితే, ఆయన మీద ఉన్న అభిమానం, ఆయనతో ఉన్న అనుబంధం, చొరవతోనే ఆమె అలా అన్నారు. కాకపోతే, తమన్నా ఒక్కసారిగా.. ‘‘డీఎస్పీ, ఇంకెన్ని చేస్తావురా నువ్వు. ఇన్ని మంచి సాంగ్స్ ఇచ్చేస్తుంటే మేం ఏం చేయాలి. ఇక్కడి నుంచి దూకాలా?’’ అని అనేయడంతో అక్కడ అందరితో ఆశ్చర్యం. దేవీశ్రీ కూడా ఏమనాలో తెలీక పైకి లేచి తమన్నాకు దండం పెట్టారు. తమన్నా మాట్లాడటానికి ముందు ఒక మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో అందరినీ కట్టిపడేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తాను చేసిన ‘డాంగ్ డాంగ్’ సాంగ్నే ఆమె స్టేజ్పై పెర్ఫార్మ్ చేశారు. తన డ్యాన్స్తో వేదికను ఒక ఊపు ఊపేశారు. పెర్ఫార్మెన్స్ అనంతరం మాట్లాడుతూ ముందుగా చీఫ్ గెస్ట్ చిరంజీవికి నమస్కారం చేశారు. చిరంజీవి, విజయశాంతి, మహేష్ బాబు లాంటి స్టార్లు పాల్గొన్న ఇలాంటి ఈవెంట్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మగ బిడ్డకు తండ్రైన సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడికి అభినందనలు తెలిపారు.
previous post