తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం హైద్రాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు.
బీజేపీ పోటీ అనే అపోహలు వద్దని, మనకు ఎవరితోనూ పోటీ లేదని కేసీఆర్ చెప్పారు. నియోజకవర్గాల్లో క్యాడర్తో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పాత కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలని సూచించారు. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారని కేసీఆర్ చెప్పారు.ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.
90 శాతం సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతు దారుల విజయం ఖాయం…