రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనతో అమరావతి రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలుచేపడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని, చంద్రబాబును దూరం పెడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు.
తుళ్లూరు రైతులు చంద్రబాబును నమ్మడం కంటే అమాయకత్వం మరొకటి ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు. తన బంధువర్గాల రియలెస్టేట్ వ్యాపారాల కోసం ఇప్పటికే ఒకసారి రైతులను చంద్రబాబు ఫణంగా పెట్టారని అన్నారు. ఇప్పుడు మళ్లీ వారినే అడ్డుపెట్టుకుని డ్రామాలు ఆడిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబును విమర్శించే స్థాయి రోజాకు లేదు: దివ్యవాణి