telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ, కర్నూలు అభివృద్ధిని చంద్రబాబు కోరుకోవడం లేదా?: స్పీకర్ తమ్మినేని

ap speaker tammineni

విశాఖ, కర్నూలు అభివృద్ధిని చంద్రబాబు కోరుకోవడం లేదా? అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే విశాఖ, కర్నూలులో అభివృద్ధి వద్దని చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో కార్య నిర్వాహక రాజధాని వద్దని, కర్నూలులో హైకోర్టు వద్దని చంద్రబాబు చెప్పగలరా? అని తమ్మినేని సవాల్ విసిరారు.

అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. అక్కడ కనీస వసతులు కూడా లేవని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడని, ఆయనకు అన్ని ప్రాంతాల ప్రజలూ ఒకటేనని అన్నారు. అందరినీ సమాన భావంతోనే జగన్ చూస్తారని పేర్కొన్నారు.

Related posts