ఏపీ సర్కార్ పై గ్లోబల్ కంపెనీలు కేసులను వేయనున్నాయని నేడు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన కథనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో టీడీపీ అధినేత చంద్రబాబు పోస్ట్ చేశారు. వీటిని చూస్తుంటే తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత జూలైలో పలు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుల బిడ్డింగ్ లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం కారణాలు చూపింది.
ఇక దీనిపై క్రిసిల్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, ఏపీలో భవిష్యత్ పెట్టుబడులకు విఘాతం కలిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని, పలు కంపెనీలు సర్కారుపై కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ కథనం ప్రచురితమైంది. విదేశీ కంపెనీలు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్థిక వ్యవహారాల శాఖను బెదిరిస్తున్నాయని ట్విటర్ లో పేర్కొన్నారు.
బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్: మాజీ ఎంపీ హర్షకుమార్