పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్య కేం ద్రం ద్వారా నిర్వహించే కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఆలస్య రుసుముతో నవంబర్ 15వరకు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ అలేఖ్య పుంజాల ప్రకటనలో తెలిపారు. డిప్లొమాలో జ్యోతిర్వాస్తు, టీవీ జర్నలిజం, డిప్లొమా లలిత సంగీతం, సినిమా రచన, జ్యోతిషం, సర్టిఫికెట్ కోర్సులు జ్యోతిషం, సంగీత విశారద, ఆధునిక తెలుగు కోర్సుల ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థులనుంచి ఆలస్యరుసుం రూ200లతో ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. గత నెల 31తో గడువు ముగిసినప్పటికీ మరో 15 రోజులు పెంచినట్లు పేర్కొన్నారు.
previous post
కశ్మీర్ అమ్మాయిలకు లైన్ క్లియర్.. హరియాన సీఎం అనుచిత వ్యాఖ్యలు