తెలంగాణలో శనివారం సాయంత్రంతో హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 21న జరుగుతుంది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడుతాయి. హుజూర్నగర్తో పాతో దేశవ్యాప్తంగా 51 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇక పోలింగ్ నేపథ్యంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలతో భద్రతను పెంచినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అభ్యర్థులపై ఎన్నికల సంఘం గట్టి నిఘా ఉంచింది. నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో వాహన తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు.