వివాదస్పద కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నాయకుడు. ఎలాంటి సమస్యనైనా ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. అయితే.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన పెన్షన్ల హామీ ఇంకా అమలు కాలేదని ఈ లేఖ లో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. 60 నుంచి 57 ఏళ్లకు తగ్గింపు హామీ రెండేళ్లయినా అతిగతీ లేదని మండిపడ్డారు. 2018 తర్వాత భర్తలను కోల్పోయిన ఒంటరి మహిలలను గుర్తించి తక్షణమే పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. గత రెండేళ్లుగా లక్షలాది మంది అర్హులు పెన్షన్లకు దూరమయ్యారని.. పెన్షన్లకు అర్హులైన వారిని గుర్తించేందుకు ఎన్యూమరేషన్ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా..ప్రస్తుతం రేవంత్ రెడ్డి రైతు భరోసా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర పేరుతో తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు రేవంత్ రెడ్డి.
next post
ఫెలైన విద్యార్థి ఏడ్చినట్టుంది చంద్రబాబు ఎడుస్తున్నాడు !