రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏడో రోజూ కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం బస్సులు నడిపిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆర్టీసీ బస్సులు అధికశాతం డిపోలకే పరిమితమయ్యాయి. అధికారులు తాత్కాలిక ఉద్యోగులతో తక్కువ సంఖ్యలో ఆర్టీసీ, అద్దె బస్సులను నడిపిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నేడు మరోసారి సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఆర్టీసీ ఐకాస, అఖిలపక్షాలు సమావేశం కానున్నాయి.