భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు పాకిస్థాన్ ప్రభుత్వం ఆహ్వానం పంపాలని నిర్ణయించింది. కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన్మోహన్ సింగ్ను ఆహ్వానించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ తాజాగా వెల్లడించారు.
సుధీర్ఘ చర్చ అనంతరం మాజీ భారత ప్రధాని మన్మోహన్ను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పిలువాలని నిర్ణయించుకున్నామని ఖురేషీ వివరించారు. ఈ విషయంలో అధికారికంగా ఆహ్వాన పత్రిక కూడా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్కు మత విశ్వాసం ఉంది. ఆయనకు పాక్లో ఎంతో గౌరవం ఉంది. అందుకే మేము అతన్ని ఆహ్వానించబోతున్నామని పాక్ మంత్రి వివరించారు.
పార్టీలో అందరి కంటే సీనియర్ నేనే.. తనకన్నా విధేయుడు ఎవరున్నారు: వీహెచ్