సరికొత్త సేవలతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు వినియోగదారుల ముందుకు వచ్చింది. నాణ్యమైన బ్యాంకింగ్ సేవలతో పాటు, నెలకు రూ.500 చెల్లింపుతో రూ.5లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను పొందేలా ‘భరోసా సేవింగ్స్ ఖాతా’ను వినియోగదారులకు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం ఆన్ బ్యాంక్, అండర్ బ్యాంక్ కస్టమర్లకు ప్రత్యేక అవసరాలను తీర్చడానికి రూపొందించినట్లు పేర్కొంది. ఖాతాదారులు ఏవైనా ప్రభుత్వ రాయితీలు పొందే సందర్భంలో నగదు తిరిగి పొందవచ్చు అని తెలిపింది. ఈ సందర్భంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఎండీ అనుబ్రాతా బిస్వాస్ మాట్లాడుతూ.. ‘భరోసా సేవింగ్స్ ఖాతా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది.
ఈ పథకం ఆర్థికంగా వెనకబడిన వారి అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. భారతీయ బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తృత పరిశోధనల తర్వాత దీన్ని ప్రారంభించాం. మిలియన్ల మంది వినియోగదారులను అధికారిక బ్యాంకింగ్ సేవలకు పరిచయం చేయడమే లక్ష్యంగా దీనిని రూపొందించాం. ఈ ఖాతా వినియోగదార్లు భారతదేశంలో ఉన్న 6,50,000 ఏపీఎస్ అవుట్లెట్లలో నగదు తనిఖీలు, ఉపసంహరణలు చేసుకోవచ్చు’ అని తెలిపారు.