సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కర్నూలులో జరపాలని మేకర్స్ భావించారు. కాని వాతావరణం అనుకూలించని కారణంగా సెప్టెంబర్ 18న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరపనున్నట్టు ఇటీవల ప్రకటించారు. కాని తాజాగా అఖిత భారత చిరంజీవి యవత సెప్టెంబర్ 22న చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగనుందని ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు రోజులలో తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్న నేపథ్యంలో వేడుకని పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తుంది. ప్రీ రిలీజ్ వేడుకకి వేడుకకు తెలంగాణ ఐటీ మంత్రి, రామ్ చరణ్ స్నేహితుడు కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి, సక్సెస్పుల్ డైరెక్టర్ కొరటాల శివ, మాస్ డైరెక్టర్ వివి వినాయక్.. అతిథులుగా రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత కేటీఆర్ హాజరు కావడం లేదని అఫీషియల్ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 18న కేటీఆర్ వేరే కార్యక్రమాలతో బిజీగా ఉండడం వలన కార్యక్రమానికి హాజరు కావడం లేదని, 22న అయితే ఆయన వచ్చే అవకాశం ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంకి సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
తమ గదికి రాలేదని సినిమాల నుంచి తొలగించిన నీచులు… రిచా చద్దా సంచలన వ్యాఖ్యలు