ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్నిలేపాయి. ప్రభుత్వ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పక్షాల్లోనూ రాజధాని అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నది స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.
మంత్రులు కూడా పదే పదే వ్యాఖ్యలు చేస్తుండడంతో అనిశ్చితి మరింత పెరుగుతోందన్నారు. అది రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనకరం కాదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన విధానం ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
పార్టీల వైఖరి కారణంగానే ఫిరాయింపులు: విజయశాంతి