ఐసీసీ టెస్టు క్రికెట్కు కొత్త ఉత్తేజం తీసుకువచ్చేందుకు, టెస్టు చాంపియన్షిప్ను కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రేపు వెస్టిండీస్తో ప్రారంభంకానున్న టెస్టు కోసం టీమిండియా కొత్త జెర్సీలను ధరించనున్నది. కొత్త జెర్సీలను ధరించిన కోహ్లీ సేన ఫోటోలు రిలీజ్ అయ్యాయి.
కొత్త రూల్స్తో పాటు టెస్టు క్రికెట్ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారనున్నది. టెస్టు క్రికెట్ కోసం ధరించే వైట్ జెర్సీలో ఆటగాళ్ల పేర్లతో పాటు జెర్సీ నెంబర్లు కూడా ఉంటాయి. వన్డేలకు బ్లూ జెర్సీ ధరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు టీమిండియా స్పాన్సర్షిప్ హక్కులను మరో నాలుగేళ్ల పాటు పేటీఎంకే అప్పగించారు.
రైతుల నుంచి భారీగా వసూళ్లు: దేవినేని ఉమ