telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎన్నికల తర్వాత జగన్ ఎన్డీయేలోకి: దత్తాత్రేయ

BJP Dattatreya comments Jagan
ఎన్నికల తరుణంలో తాజా రాజకీయ పరిణామాల పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్నికల తర్వాత జగన్ ఎన్డీయేలోకి వస్తారని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ చెబుతున్న జాబితాలోని అత్యధికులు ఎన్డీయేలోకి వస్తారని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ కూడా ఎన్డీయే పక్షాన చేరే అవకాశం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ సహా ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ పక్షాలకు ఎన్నికలు పూర్తయ్యాక ఎన్డీయేనే దిక్కు అని ఆయన అన్నారు.  
తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో చాలా సర్జికల్ స్రైక్స్ జరిగాయని, ఎప్పుడైనా చెప్పుకున్నామా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు దత్తాత్రేయ కౌంటర్ ఇచ్చారు. కేంద్రమంత్రిగా కేసీఆర్‌ ఒక్క కేబినెట్‌ భేటీకి కూడా వెళ్లలేదని, కేసీఆర్‌కు సర్జికల్‌ దాడుల గురించి ఏం తెలుసని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  

Related posts