విజయసాయిరెడ్డి చెత్త ఐడియాలతో జగన్ అమెరికా పర్యటన మొత్తం తుస్సుమందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. జగన్ అమెరికా నుంచి వచ్చేలోపు విజయసాయిరెడ్డి వెళ్లి రైతుల బుగ్గలు నిమిరే కార్యక్రమం మొదలుపెట్టాలని ట్విట్టర్ లో విమర్శించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చూసి చంద్రబాబు వణికిపోతున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు విమర్శించిన సంగతి తెలిసిందే.
విజయసాయిరెడ్డి విమర్శలను టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తిప్పికొట్టారు. అమిత్ షాను చూసి ప్యాంటు ఎవరు తడుపుకుంటున్నారో మోదీ తిరుపతి టూర్ లో ప్రజలంతా చూశారని వెంకన్న తెలిపారు. కేంద్రం మెడలు వంచుతామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు కాళ్లు పట్టుకుంటున్న విజయసాయిరెడ్డి కూడా ధైర్యం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.