హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శామీర్పేట ఎమ్మార్వో కార్యాలయం ముందు రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా డివైడర్ను ఢీకొట్టిన కారు ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న మరో కారుపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ రహదారిపై అత్యంత వేగంగా కారు దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
అక్రమ కేసులతో కేసీఆర్ భయపెట్టాలని చూస్తున్నారు: కిషన్ రెడ్డి