ప్రముఖ దర్శకుడు శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం “భారతీయుడు”. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా “ఇండియన్-2” టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఆగస్ట్ నుండి చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ప్రియా భావన శంకర్, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీలక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఇందులో సిద్ధార్ద్, విద్యుత్ జమాల్, ఢిల్లీ గణేష్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. 2021లో తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని మార్చి14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఆ దిశగానే షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ విషయమై చిత్రబృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరి చూడాలి ఈ చిత్రం కూడా “భారతీయుడు”లాగే సంచలన విజయాన్ని నమోదు చేసుకుంటుందేమో.
previous post