రామకృష్ణ వెంప దర్శకత్వంలో తనిష్క్రెడ్డి, ఎలక్సియన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “దర్పణం”. క్రాంతికిరణ్ వెల్లంకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ “క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. అనుక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కథానుగుణంగా టైటిల్ పెట్టాం. నటీనటులందరూ చక్కటి అభినయాన్ని కనబరిచారు’ అన్నారు. ‘థ్రిల్లర్ చిత్రాల్లో పూర్తి విభిన్న చిత్రమిది. కథ, కథనాలు నవ్యరీతిలో ఉంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని నిర్మాత తెలిపారు.
ఈ సినిమాలోని లిరికల్ సాంగ్ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సాంగ్ చాలా బాగుంది. సిద్ధార్థ్ అద్భుతమైన స్వరాల్ని అందించాడు. వినూత్నమైన కాన్సెప్ట్తో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సిద్ధార్థ్ సంగీతం సమకూరుస్తున్నారు.