telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తిరుపతిలో శర్వానంద్ ‘శ్రీకారం’ షూటింగ్

srikaaram

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల జాను సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ రైతుపాత్రలో ‘శ్రీకారం’ అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్ అన్ని ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతుండటంతో శర్వా ‘శ్రీకారం’ కూడా తిరుపతిలో ప్రారంభమైనట్లు చిత్రబృందం ట్విట్టర్ వేదికగా తెలిపారు. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నాడు. శర్వా సరసన ప్రియాంకా అరుల్‌ మోహన్ హీరోయిన్ గా‌ నటిస్తోంది.

Related posts