telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పాకిస్థానీ నెటిజెన్ కు కేటీఆర్ గట్టి కౌంటర్

ktr trs

బీజేపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ పాకిస్థానీ నెటిజెన్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే, సుష్మ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో ఆమెను కలసినప్పటి ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు స్పందించిన ఓ పాకిస్థానీ నెటిజెన్ దారుణ వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే ఆమె చనిపోయారని… ఆమె కోసం నరకం ఎదురు చూస్తోందని ట్వీట్ చేశాడు. పాకిస్థానీ నెటిజెన్ వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు.

సుష్మాస్వరాజ్ మరణంపై మీరు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీ వక్ర బుద్ధికి ఈ కామెంట్ అద్దం పడుతోందని మండిపడ్డారు. మీ ప్రొఫైల్ పిక్ చూస్తుంటే… మీరు పాకిస్థాన్ కు చెందినవారిలా ఉన్నారని అన్నారు. జీవితాంతం ప్రజాసేవలో ఉన్న సుష్మాస్వరాజ్ లాంటి వారిని గౌరవించడానికి మీరు కొంత ధైర్యాన్ని సంపాదించుకోగలని ట్వీట్ చేశారు.

Related posts