ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీకి యూకే కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మోదీ రెండోసారి బెయిల్ కోసం యూకే వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆశ్రయించగా..బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. నీరవ్ ను వాండ్స్వర్త్ జైలు నుంచి వీడియో ద్వారా విచారణ చేపట్టిన వెస్ట్మినిస్టర్ కోర్టు నకిలీ ఎల్ఓయూల ద్వారా పీఎన్బీ నుంచి నగదు దోచుకున్న కేసులో నీరవ్మోదీ ప్రధాన లబ్దిదారుడని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ను తిరస్కరించి రిమాండును ఆగస్టు 22 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. నీరవ్ మోదీ పీఎన్ బీ బ్యాంకు రుణాలకు ఎగనామం పెట్టి లండన్ కు పారిపోయిన విషయం తెలిసిందే.
నేను ట్రెండ్ ఫాలో అవ్వను బ్రదర్, ట్రెండ్ సెట్ చేస్తా… నితిన్ కామెంట్స్ పై సాయి ధరమ్ తేజ్