telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోడెల అంతిమయాత్ర ప్రారంభం..

kodela funerals

ఏపీ మాజీ స్పీకర్ కోడెల అంతిమయాత్ర బుధవారం నరసరావుపేటలో ప్రారంభమైంది. కోడెలను కడసారి చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోడెల నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర కోట సెంటర్, సత్తెనపల్లి రోడ్డు, వినాయక టెంపుల్, బరంపేట, టూటౌన్ పీఎస్, పల్నాడు రోడ్డు, మల్లం సెంటర్, ఐలా బజార్ మీదుగా స్వర్గపురికి చేరుకోనుంది.

ఎనిమిది కిలోమీటర్ల మేర అంతిమయాత్ర కొనసాగనుంది. ఈ అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. భారీగా తరలి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులతో నరసరావుపేట రోడ్లు కిక్కిరిసిపోయాయి. స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి.

Related posts