విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నారంటూ జగన్ సర్కారుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని హ్యాపీ రిసార్ట్స్ లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీఅయ్యారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ పాలన చేతకాకపోతే సమర్థులను సంప్రదించి నేర్చుకోవాలంటూ సర్కారుకు హితవు పలికారు. అసమర్థ పాలనతో ప్రజలను కష్టాలకు గురిచేస్తున్నారని,
టీడీపీ ఐదేళ్ల పాలనలో మిగులు విద్యుత్ ఇచ్చామని, భవిష్యత్తులో విద్యుత్ ధరలు పెరగకుండా జాగ్రత్త వహించామని తెలిపారు. పీపీఏలపై టీడీపీ ప్రభుత్వ విధానాలను కేంద్రం, ఫిచ్ సైతం ప్రశంసించాయని అన్నారు. ఇప్పుడు పీపీఏలపై సమీక్ష చేయాల్సిన అవశ్యకతపై జగన్ సర్కారు వితండవాదం చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ విధానాలపై సమాధానం చెప్పలేని పరిస్థితి ప్రభుత్వం ఉందని ఆరోపించారు. విద్యుత్ రంగాన్నిఈ ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు.


సమస్యలపై రాసిన లేఖలకు జగన్ నుంచి స్పందన లేదు : కన్నా