పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు మంచి స్పందన వచ్చింది. అలాగే టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ కాంబినేషన్ కి ఏ సర్టిఫికెట్ రావడం విశేషం. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించే రామ్ – మాస్ ఆడియెన్స్ ని ఎట్రాక్ చేసే పూరి ఎప్పుడు లేని విధంగా మాస్ మసాలా డోస్ ని ఎక్కువగా పెంచేశారు. బిజినెస్ మెన్ సినిమా అనంతరం పూరి సినిమాలకు A సర్టిఫికెట్ రాలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు వచ్చింది. సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ తో Aసర్టిఫికెట్ ని జారీ చేసింది. డబుల్ దిమాక్ తో రామ్ చేసే హడావుడి సినిమాలో మాములుగా ఉండదట. క్రైమ్, రొమాన్స్ అంశాలు కూడా సినిమాలో ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ట్రైలర్స్ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటాడో చూడాల్సిందే.
previous post
మంచు ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది..