telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అభిమానులను ఆదుకున్న వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

Pawan

జనసేన అధినేత ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాల్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్ బర్త్ డే వేడుకల్లో భాగంగా దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా… విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 10 మంది పవన్ అభిమానులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. వారందరి కుటుంబాలను పలువురు సినీ ప్రముఖులు ఆదుకున్నారు. దీంతో వారికి పవన్ కల్యాణ్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. “కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి, అలాగే పెద్దమనసుతో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి, నిర్మాతలు- శ్రీ దిల్ రాజు, శ్రీ ఎఎమ్ రత్నం, మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు నా కృతజ్ఞతలు” అని పవన్ ట్వీట్ చేశారు.

Related posts