నగరంలో సమంత అభిమానుల సందడి.. తమ అభిమాన హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఓ బేబీ’ సినిమాపై టాలీవుడ్ లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నెల 5న సినిమా విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో సమంత నిలువెత్తు కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు.
నగరంలోని దేవి థియేటర్ లో సమంత చిరునవ్వులు చిందిస్తున్న భారీ కటౌట్ ను పెట్టారు. దీన్ని సోషల్ మీడియాలో సమంత, అక్కినేని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. దక్షిణకొరియాకు చెందిన సినిమా మిస్ గ్రానీ(2014) స్ఫూర్తితో ‘ఓ బేబీ’ని దర్శకురాలు నందినీరెడ్డి తెరకెక్కించారు.
జాక్స్ ను హర్ట్ చేసిన పూరీ… ఇకలేడు