telugu navyamedia
సినిమా వార్తలు

శివుడికి ఇష్టమైన పారిజాతం పూలు శ్రీరెడ్డి వాకిట్లో…!!

Srireddy

వేధింపుల వ్యవహారం బయటపెట్టి పలువురిపై సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొందరిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పై అయితే మరి ఘోరంగా కామెంట్స్ చేస్తోంది. తాజాగా శ్రీరెడ్డి శ్రీరెడ్డి తోటలో పారిజాతం చెట్టు పూలు పూశాయి. ఆ విషయాన్ని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించింది. కొన్ని పూలను కోసి శివుడిని అర్చించారు కూడా. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “శివ భగవానుడికి ఇష్టమైన పారిజాతం పూలు మా తోటలో పూశాయి. ఇవి రాత్రి పూట మాత్రమే వికసిస్తాయి. హరహర మహాదేవ్” అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతోపాటు శ్రీరెడ్డి తోటలో మొలిచిన పుట్ట గొడుగులను కూడా ఫొటో తీసి పోస్ట్ చేసింది. అవి తమ ఇంట్లో పండినవేనని, అవి మంచివేనా అని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు నెటిజన్లు పలు రకాల సమాధానాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ గడుపుతోంది. 

Related posts