telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

మందలించినందుకు టీచర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి

Two sons murder after father sucide

హోమ్‌వర్క్‌ ఎందుకు చేయలేదని మందలించినందుకు ఓ టీచర్‌ను విద్యార్థి కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు.సంఘటన హర్యానా రాష్ట్రంలోని సోనిపేట్‌లోని భిగన్‌ గ్రామంలోని శ్రీరామ్‌ కృష్ణ స్కూల్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఈ వేసవి సెలవుల అనంతరం హర్యానాలో సోమవారం పాఠశాలలు తెరుచుకున్నాయి.

స్కూల్‌లో పని చేస్తున్న ఇంగ్లీష్‌ టీచర్‌ ముకేశ్‌ కుమారి నిన్న పదకొండో తరగతిలోకి వెళ్లి సమ్మర్‌ హోమ్‌వర్క్‌ చేశారా? అని విద్యార్థులను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి.. టీచర్‌ను పదునైన కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం బాధిత టీచర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Related posts