వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచనుందని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ను ఆనుకొని, ఈశాన్య జార్ఖండ్ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కేంద్రీకృతమైంది.
దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచించారు.