టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శిగా ఆచార్య రాజగోపాలన్ను నియమిస్తూ టిటిడి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సాహిత్య విభాగ ఆచార్యులైన ఆయనను డిప్యుటేషన్పై టిటిడి డిపిపి కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజగోపాలన్కు విద్యాపీఠం వైస్ఛాన్సలర్ మురళీధర్శర్మ, రిజిస్ట్రార్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి అభినందనలు తెలిపారు.