క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ సమరం మరికాసేపట్లో మొదలుకానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్లో దాయాదుల సమరానికి మాంచెస్టర్ ఆతిథ్యమిస్తోంది. ఈ చిరకాల ప్రత్యర్థుల సమరంలో పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
వాతావరణంలో తేమ ఉండడంతో తమ పేస్ బౌలర్లు భారత్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేస్తారన్న ఉద్దేశంతో పాక్ సారథి సర్ఫరాజ్ నవాజ్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు టీవీలకు అతుక్కుపోయారనడంలో అతిశయోక్తిలేదు. అయితే, మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న మాంచెస్టర్ లో ఉదయం నుంచి వర్షం అడపాదడపా కురుస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.