తెలంగాణలో ఇంటర్ బోర్డులో నెలకొన్న గందరగోళంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే వరంగల్లో మరో ఘటన చోటుచేసుకుంది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పేపర్లు మాయమవ్వడం కలకలం రేపుతోంది. రెండు సీల్డ్ బాక్సులు మాయమవ్వడం గమనార్హం.
కస్టోడియన్ తనిఖీల్లో వెల్లడైన బాక్సులు గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా టెన్త్ అడ్వాన్స్ పరీక్షాపత్రాల బాక్సుల తాళాలు పగులగొట్టి సిబ్బంది చెక్ చేసింది. మరోవైపు పోలీసులు విచారణ చేపట్టారు. తాజా ఘటనతో మరోసారి ఇంటర్ బోర్డు వైఫల్యం బహిర్గతమైంది.