యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వేల్యూస్తో సినిమాను రూపొందుతుంది. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు చిత్రబృందం. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా “సాహో” ట్రైలర్ డేట్ ఫిక్సయ్యిందని సమాచారం. ఈద్ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను జూన్ 5న విడుదల చేయబోతున్నారట. త్వరలోనే ట్రైలర్ డేట్ విషయమై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రభాస్ లుక్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
next post