హింసతో తమను అణగదొక్కలేరని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. కోల్కతాలో మంగళవారం జరిగిన తన ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ పధకం ప్రకారం హింసకు పాల్పడిందని ఆరోపించారు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు.ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న దీదీకి బెంగాలీలు ఓటమి రుచిచూపుతారని ఆయన హెచ్చరించారు.తన రోడ్షోపై తృణమూల్ కాంగ్రెస్ దాడికి పాల్పడిందని దుయ్యబట్టారు.
రోడ్షోకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని అన్నారు. రోడ్షో సందర్భంగా బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరైగిన నేపథ్యంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం కూల్చివేత ఘటనలు కలకలం రేపాయి.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థచే దర్యాప్తు జరిపించాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
చంద్రబాబును చూసి ఎవరు ఓటెయ్యరు: ఎంపీ జేసీ