తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కీలక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ షికార్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది జరగని పని అని కోదండరాం తేల్చిచెప్పరు.
ఫ్రంట్ పేరుతో సమయం వృథా చేసుకోకుండా ప్రజల కష్టాలకు పరిష్కార మార్గం ఆలోచించాలని హితవు పలికారు. లోక్ సభ ఎన్నికల తర్వాత మహాకూటమి కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్, జగన్ మాత్రమే ఉంటారని కోదండరాం ఎద్దేవా చేశారు.కేసీఆర్, జగన్ మినహా దేశంలోని అనేక పార్టీల నేతలు మహాకూటమి కోసం చేతులు కలిపారని అన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పెరుగుతున్న ఎండలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వంపై ఉందన్నారు.
మా ప్రభుత్వంలో ఆడపిల్లలకు పూర్తి రక్షణ: ఎమ్మెల్యే రోజా