telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

డే-నైట్ టెస్ట్ కు భారత జట్టు ఇదే…

indian cricket team condolence to jaitly

భారత్-ఆసీస్ మధ్య రేపటినుండి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు వహించనున్న ఈ మ్యాచ్ కు రహానే వైస్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా ఎవరు వస్తారు అనేదాని పై మొదటి నుండి పెద్ద చర్చ సాగింది. మయాంక్ తో కలిసి యువ ఓపెనర్ పృథ్వీ షా బరిలోకి దిగనున్నారు. అయితే సూపర్ ఫాంలో ఉన్నప్పటకీ కేఎల్ రాహుల్ తుది జ్టట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. గత పర్యటనలో చెలరేగిన పుజారా తో పాటుగా తెలుగు క్రికెటర్ హనుమ విహారి కూడా ఈ ప్రతిష్టాత్మక టెస్ట్ కు ఎంపికయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ గా సాహానే వ్యవరించనున్నాడు. అయితే స్పిన్నర్ గా కేవలం రవిచంద్రన్ అశ్విన్ ను మాత్రమే ఎంపిక చేయగా పేసర్లు గా ఉమేష్ యాదవ్, షమీ, బుమ్రా లను ఎంపిక చేసారు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తుందా… లేదా అనేది.

భారత జట్టు : పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానె, హనుమా విహారీ, వృద్దిమాన్ సాహా (wk), రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

Related posts