మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టి అదే వేగంతో వెళ్లి బావిలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాసిక్లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టైరు పేలిపోవడం వల్ల ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
బస్సు బావిలో పడడంతో అందులోని ప్రయాణికులు తప్పించుకునే వీలు లేక జలసమాధి అయ్యారు. మృతుల్లో ఆటో, బస్సు ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం: జీవన్రెడ్డి