లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లోని అమేథితో పాటు కేరళలో వయనాడ్ రెండు చోట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అద్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేంద్ర హోమంత్రిత్వ శాఖ తాజాగా నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలో రాహుల్ భారతీయతపై ఆమె సోదరి, యూపీ ఈస్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అండగా నిలిచారు.
రాహుల్ భారతీయుడేనా అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తుతుండటంపై ఆమె మండిపడ్డారు. తన సోదరుడిపై చేస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. ‘రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం దేశం మొత్తానికి తెలుసు. ఆయన ఇక్కడే పుట్టాడు. ఇక్కడే పెరిగాడు. ఆయనపై కట్టుకథలు అల్లుతున్నారని ప్రియాంక మండిపడ్డారు.